ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మనోబలం సదా రక్షిస్తోంది. ముందుజాగ్రత్త లేకపోవడం వల్ల అనవసర ఖర్చులు వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మంచి ఫలితాలు లభిస్తాయి.
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి, అభివృద్ధి సూచనలు ఉన్నాయి. విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతీ పని సఫలం అవుతుంది. వ్యాపారంలో స్వయంకృషి అవసరం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం అయినా క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వారం చివర భాగంలో శుభపరిణామాలు ఉంటాయి. శ్రీవేంకటేశ్వర స్వామి స్మరణ మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది.